కన్నాపూర్లో బిజెపి శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ శంకరపట్నం ఫిబ్రవరి 24 ప్రజాపాలన విలేఖరి:

Published: Saturday February 25, 2023

శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో శుక్రవారము బిజెపి శక్తి కేంద్ర ఇంచార్జీ జంగా జైపాల్ అధ్యక్షతన కార్నర్ మీటింగ్ ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధీగా బిజెపి జిల్లా కార్యదర్శి రంగు భాస్కరాచారి హాజరై మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ అన్ని వర్గాల సంక్షేమాని కృషి చేస్తున్నారని అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరించి చెప్పటం జరిగింది. రాష్ట్రంలో కెసిఆర్ నిరంకుశ పాలన వల్ల బిఆర్ఎస్ పార్టీ ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయిందని, రానున్నది బిజెపి ప్రభుత్వమేనని తెలిపారు బూత్ స్థాయిలో పార్టీని మరింత బలం చేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని  పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు జంగా జైపాల్ ,మండల జనరల్ సెక్రెటరీ దాసరపు నరేందర్ ,ఎలకపల్లి సంపత్ , మండల ఉపాధ్యక్షులు పిన్ రెడ్డి సంపత్ రెడ్డి ,జానపట్ల రాజిరెడ్డి ,పెసర అర్జున్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కనకం సాగర్, మండల్ సోషల్ మీడియా కన్వీనర్ చుక్కల శ్రీకాంత్ ,సొసైటీ డైరెక్టర్ కాల్వ రమణారెడ్డి, బూత్ అధ్యక్షులు, రాజు, కాటం సమ్మిరెడ్డి, రాజిరెడ్డి, రమణారెడ్డి, శివారెడ్డి వివిధ గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.