పవన్ కళ్యాణ్ పై పోసాని చేసిన వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

Published: Friday October 01, 2021
బోనకల్లు, సెప్టెంబర్ 30, ప్రజాపాలన ప్రతినిధి : జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ జనసేన పార్టీ మదిర నియోజకవర్గ బాద్యులు తాళ్లూరు డేవిడ్ సమక్షంలో బోనకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వారి యొక్క కుటుంబ సభ్యుల పై జనసేన కార్యకర్తలపై పవన్ కళ్యాణ్ అభిమానుల పై పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలను పరిగణంలోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గ ఇంచార్జ్ తాళ్లూరు డేవిడ్, సంతోష్ కుమార్, ఎస్ కే బాజీ, సాధినేని గోపాల్ రావు, వేముల వినయ్  తదితరులు పాల్గొన్నారు.