శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి దైవ ధర్శనంలో మార్పులు...

Published: Friday April 23, 2021
జగిత్యాల, ఏప్రిల్ 22, ప్రజాపాలన ప్రతినిధి : సారంగాపూర్ మండలం పెంబట్ల శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి  దైవ దర్శనంలో మార్పులు చేశారు. జగిత్యాల జిల్లాలో కరోన కేసులు రోజు రోజుకు పెరగడంతో శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంకు వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని  భక్తులకు దర్శనం వేళలు మార్చారు. ఉదయం 7 గంటల  నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే భక్తులకు దైవ సర్వదర్శనం అవకాశం కలదు. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం మూసివేయబడును. కావున భక్తులు గమనించగలరని ఈవో కాంతారెడ్డి తెలిపారు.