ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య కార్పొరేషన్ కన్వీనర్ గా కుంచం కృష్ణారావు

Published: Thursday August 19, 2021
మధిర, ఆగష్టు 18, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీఖమ్మం జిల్లా ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన సమితి కన్వీనర్ గా మధిర కు చెందిన జిల్లా ఆర్యవైశ్య నాయకులు కుంచం కృష్ణారావు ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన సమితి వ్యవస్థాపక కన్వీనర్ మునగాల కాంతారావు నియామక పత్రాన్ని అందచేశారు ఈ సందర్భంగా కుంచం కృష్ణారావు మాట్లాడుతూ గతంలో నేను ఈ సాధన సమితి కి మండల కన్వీనర్ గా పనిచేసి ఆర్యవైశ్య కార్పొరేషన్ కొరకు  ప్రజా ప్రతినిధులకు వినతి పత్రము లు మరియు రిలే నిరాహార దీక్ష లలో పాల్గొని పోరాటం చేసి ఉన్నాము త్వరలోనే జిల్లా మొత్తం మండల కమిటీలు మరియు పట్టణ కమిటీ లు పూర్తి చేసి ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధించుకోవడానికి జిల్లాలో ఉన్న ఆర్యవైశ్య నాయకులను మరియు పెద్దలను ఆర్య వైశ్యులు అందరిని సమావేశపరచి కార్యాచరణ రూపొందిస్తానని కుంచం కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు వీరి నియామకం పట్ల పలువురు ఆర్య వైశ్య ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు