ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని సన్మానించిన టిఆర్ ఎస్ నాయకులు

Published: Tuesday August 03, 2021

జిన్నారం, ఆగస్టు 2, ప్రజాపాలన ప్రతినిధి : పటాన్చేరు లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సమావేశంలో పటాన్చెరు పట్టణంలో అత్యాధునిక వసతులతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గత ఎనిమిది నెలలుగా ఆసుపత్రి ఏర్పాటుకు పట్టువదలని విక్రమార్కుడు గా స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేసిన కృషి ఫలించిందని. 250 కోట్ల రూపాయలతో 270 పడకల ఆసుపత్రిని ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని టిఆర్ఎస్ నాయకులు జడ్పీ వైస్ ఛైర్మన్ ప్రభాకర్, జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, శాలువతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజీవ్, వార్డు సభ్యులు గోకర్ శ్రీధర్ గౌడ్, నాయకులు మంద రమేష్, కొరబోయిన నరేష్, బ్రమేందర్ గౌడ్, తోట నర్సింగ్ రావు, కొరబోయిన యాదయ్య, మంద పవన్ తదితరులు పాల్గొన్నారు