సమాజ సేవలో కాకతీయ కమ్మ సంఘం

Published: Monday July 12, 2021
మధిర, జూలై 11, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిరలో కాకతీయ కమ్మ సంఘం అండగా ఉండటం ఎంతో అభినందనీయమని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం పేర్కొన్నారు. మధిరలో కరోనా సోకిన హోమ్ ఐసోలేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్లి కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో భోజనం అందించే కార్యక్రమాన్ని ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధిర కాకతీయ కమ్మ సంఘం ఆధ్వర్యంలో కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండి 45 రోజులపాటు భోజనం అందించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాకతీయ కమ్మ సేవా సమితి బాధ్యులు గడ్డం శ్రీనివాసరావు చెరుకూరి నాగార్జున మాట్లాడుతూ కాకతీయ కమ్మ సంఘం ద్వారా ప్రతి రోజూ దాతల సహకారంతో కులమతాలకతీతంగా కరోనా బాధితుల అందరికీ ఆహారం అందించినట్లు వారు తెలిపారు. చెరుకూరు నాగార్జున అధ్యక్షులు జరిగిన ఈ కార్యక్రమంలో రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షులు పుతుంబాక శ్రీ కృష్ణ ప్రసాద్, రావూరి శ్రీనివాసరావు, కట్టా గాంధీ రిటైర్డ్ ఎంపీడీవో మల్లాది చిన్న వెంకటేశ్వర్లు గడ్డం రమేష్ తదితరులు పాల్గొన్నారు.