వర్షానికి పొంగి పొర్లుతున్న వాగులు వంకలు
Published: Friday July 16, 2021
కల్లూరు, పైడిమాడుగు గ్రామాల మధ్య రాకపోకలు బంద్
కోరుట్ల, జూలై 15 (ప్రజాపాలన ప్రతినిధి) : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని నదులు జలకళను సంతరించుకున్నాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో వాగులు వంకలు పొంగిపొగ్లుతుండటంతో ఆయా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. బుధవారం రాత్రి కరిసిన వర్షాలకు ఎగువన ఆనకట్టలు తెగిపోవడం వలన మండలం లోని కల్లూరు, పైడిమాడుగు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి, వాగు యొక్క ప్రవాహం ఎక్కువగా ఉండడం వలన వాగు చుట్టుపక్కల ఎవరు పోకూడదని గ్రామ సర్పంచ్ వనతడుపుల అంజయ్య విజ్ఞప్తి చేశారు.
Share this on your social network: