శాంతి నిలయంలో ఘనంగా దీపావళి సంబరాలు

Published: Wednesday October 26, 2022

బోనకల్ ,అక్టోబర్ 26 ప్రజా పాలన ప్రతినిధి:దీపావళి పండుగను పురస్కరించుకుని మానసిక వికలాంగుల శరణాలయం శాంతి నిలయం నందు మంగళవారం ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. గుడిమెట్ల రజిత మానసిక వికలాంగ పిల్లలతో కలిసి క్రాకర్సు కాల్చుతూ వారికి ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని కల్పించారు. అనంతరం అరటి పండ్లు , బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత మాట్లాడుతూ శాంతి నిలయం లోని మానసిక వికలాంగుల మధ్య దీపావళి పండుగను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, మానవ సేవే మాధవ సేవ"గా భావిస్తూ పండుగలను అనాధలు, దివ్యంగులు మధ్య జరుపుకోవడం వలన వారుకూడా ఆనందంగా జీవిస్తారని, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టసుఖాలు ఉంటాయని వాటిని అధిగమించి సమాజానికి ఉపయోగపడే విధంగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుడిమెట్ల మోహన్ రావు, శాంతి నిలయం నిర్వాహకులు సిస్టర్ ఆల్ ఫీ, సిస్టర్ బిజిలీ, సిస్టర్ మరియా, సిస్టర్ ప్రేమ, సిస్టర్ మేరి, సిస్టర్ రోసాలియా, సిస్టర్ కుమారి, విద్యార్థులు సోను, కావ్య, ముత్తి, నాగమణి, మేఘన, అంబిక, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.