అద్భుతమైన నిర్మాణాలు చేపట్టుటకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

Published: Friday October 01, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 30 సెప్టెంబర్ ప్రజాపాలన : వికారాబాద్ పట్టణ పరిధిలో అద్భుతమైన నిర్మాణాలు చేపట్టుటకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి, రామయ్యగూడ దగ్గర నిర్మించిన స్మశానవాటికల నిర్మాణ కోసం స్థలం పరిశీలించారు. పనులను వేగవంతంగా నాణ్యతతో నిర్మించాలన్నారు. వెంటనే స్మశాన వాటికలకు కేటాయించిన స్థలాన్ని రెవెన్యూ అధికారులతో సర్వే చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర కౌన్సిలర్లు సుధాంష్ కిరణ్ పటేల్, చిట్యాల అనంత్ రెడ్డి, మల్లేపల్లి నవీన్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ మేక చంద్రశేఖర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.