శ్రీ సత్య సాయి సేవా ట్రస్ట్ సేవలుఅభినందనీయం... --ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్

Published: Friday January 20, 2023

జగిత్యాల, జనవరి 19 (ప్రజాపాలన ప్రతినిధి): సిద్దిపేట జిల్లా కొండపాక లోని శ్రీ సత్య సాయి సేవా ట్రస్ట్ వారి అధ్వర్యంలో  స్కూలు కాలేజీ మరియు హాస్పిటల్ ను  నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఈ సందర్భంగా సత్యసాయి సేవా ట్రస్ట్ శ్రీ శ్రీ మదుసుదన సాయి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భం లో వారిని దర్శించు కొనగా వారు అక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ ఇప్పటికే జగిత్యాల జిల్లా లో దాదాపు 30 వేల మంది విద్యార్థులకు ప్రభుత్వ  పాటశాలలో ప్రతి రోజూ ఉచితంగా రాగి జావ ఇస్తున్నారనీ ఎమ్మేల్యే అన్నారు. బీద మధ్యతరగతి ప్రజలకు విద్య వైద్యం లో జగిత్యాల కి సత్య సాయి ట్రస్ట్ వారి సేవలను విస్తరించాలని, చిన్న పిల్లలకు గుండె సంబంధిత వైద్య సేవలు జగిత్యాల లో  ఏర్పాటు చేయాలని కోరగా వారు సానుకూలంగా స్పందించారని ఈ సందర్భంగా  శ్రీ శ్రీ మధుసూదన సాయికి, శ్రీ సత్య సాయి సేవా ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ మండల అధ్యక్షులు బాల ముకుందం, కోటగిరి శ్రీనివాస్, వూటురి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.