సభ్యత్వ నమోదును వేగం పెంచండి

Published: Thursday January 20, 2022
ధారూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
వికారాబాద్ బ్యూరో 19 జనవరి ప్రజాపాలన : కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదును మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ధారూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ళ రఘువీరారెడ్డి అన్నారు. బుధవారం మండల ముఖ్య కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదు చేయడం వలన  ప్రజలతో సత్సంబంధాలు పెరుగుతాయని భవిష్యత్తులో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పెంపుదలకు ఇది దోహదపడుతుందని తెలిపారు.  జిల్లాలోనే మండలాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని కోరారు. మండలంలో ఇప్పటివరకు 5 వేలకు పైగా సభ్యత్వాలు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. మన టార్గెట్ 15 వేలు ఛేదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సంతోష్, చేవెళ్ల పార్లమెంట్ డిజిటల్ మెంబర్ షిప్ కోఆర్డినేటర్ చామల రఘుపతిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనంతరెడ్డి, మాజీ ఎంపీపీ నరసింహులు, వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, సర్పంచులు పాండునాయక్, ధర్మాపూర్ గ్రామ సర్పంచ్ బోడ అనిల్, సీనియర్ నాయకులు బుజ్జయ్య గౌడ్, మాన్ సింగ్, బాబాఖాన్, గఫార్, కిషోర్, హనుమయ్య, మాజీ ఎంపీటీసీ రమేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.