పల్లె అభివృద్ధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి

Published: Wednesday February 09, 2022
జన్నారం రూలర్ ఫిబ్రవరి 08 ప్రజాపాలన : పల్లె అభివృద్ధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని బీజేవైఎం మండల అధ్యక్షుడు ఎం ప్రవీణ్ అన్నారు, ఈ సందర్భంగా ఆయన మంగళవారం ప్రజాపాలనతో మాట్లాడుతూ పల్లె అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు, పల్లెల్లో మౌళిక సౌకర్యం కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ఆయన సూచించారు, పల్లెలకు రహదారి సౌకర్యం కల్పించుటకు ప్రధాన సడక్ యోజన, రైతులకు పైసల్ యెాజనా, యువతకు మేక్ ఇన్ ఇండియా, నిరుపేదల కూలీల కోసం ఉపాధి పనులు పల్లెల్లో వేగంగా జరుగుతున్నాయని అన్నారు, కేంద్ర ప్రభుత్వం పథకాలతో ప్రజలకు మెలు జరుగుతుందని అయన వివరించారు, ప్రజాసంక్షేమానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అయన సూచించారు.