రాయికల్ మండలం లోని ఒడ్డె లింగాపూర్ గ్రామాన్ని మండలం గా ప్రకటించాలి

Published: Monday July 25, 2022

రాయికల్, జూలై 24(ప్రజా పాలన ప్రతినిధి):
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం లోని ఒడ్డె లింగాపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గ్రామస్తులు శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితక్క ఇంతకుముందు ఎంపీగా ఉన్న సమయంలో బోర్ణపెళ్లి లోని బ్రిడ్జి మరియు రామాలయం ఓపెనింగ్ కు వచ్చినప్పుడు వడ్డే లింగాపూర్ గ్రామాన్ని మండలం గా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు అలాగే సీఎం కేసీఆర్ గారు నిజామాబాద్ లో జరిగిన సభలో స్వయంగా ఒడ్డె లింగాపూర్ గ్రామాన్ని మండలం గా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు కానీ నిన్న ప్రకటించిన కొత్త మండలాలలో ఒడ్డె లింగాపూర్ గ్రామం లేకపోవడం గ్రామస్తులు నిరాశకు గురి చేసింది దీని పర్యవసానంగా గ్రామస్తులు మరియు చుట్టుపక్కల గ్రామాల వారు అందరు కలిసి శాంతియుతంగా నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ విషయంపై గ్రామస్తులు అందరూ కలిసి మాట్లాడుతూ ఎలాగైనా సరే జగిత్యాల శాసనసభ సభ్యులు ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు.