మహిళలు స్వయం శక్తి తో ఎదగాలి

Published: Tuesday October 12, 2021
బాలాపూర్: అక్టోబర్ 11 ప్రజాపాలన ప్రతినిధి : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కార్పొరేషన్ మేయర్ పేర్కొన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లో ఒకటో డివిజన్ కార్పొరేటర్ పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి సహోదరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు విద్యార్థినిలకు ఏర్పాటు చేసిన ఇండస్త్రీయల్ స్వివింగ్ మెషిన్, టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులు ఉచిత శిక్షణ కేంద్రాన్ని మీర్ పేట్ బడంగ్ పేట్ కార్పొరేషన్ మేయర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ..... మహిళలు, విద్యార్థినిలు స్వయం శక్తి తో ఎదిగేందుకు ఇలాంటి కోర్స్ లు ఉపయోగ పడతాయని ఆమె చెప్పారు. ఇప్పుడు ఉన్న ఆధునిక యుగంలో మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, కార్పొరేటర్లు పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, అరుణ ప్రభాకర్, మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ టిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి,సహోదరీ ఫౌండేషన్ నిర్వహకురాలు స్వర్ణలత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.