తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Thursday June 03, 2021
పరిగి మే 2 ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి స్వగృహంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలను భౌతిక దూరంతో ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మహేష్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరవింద్ రావు, జెడ్పిటిసి హరిప్రియ ప్రవీణ్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, తెరాస పార్టీ మండల అధ్యక్షులు ఆంజనేయులు, తెరాస సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, పి ఎ సి ఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, మాజీ ఎంపిటిసి ఫోరం అధ్యక్షులు సురేందర్, తెరాస పార్టీ మహిళా అధ్యక్షులు లక్ష్మీ, నాయకులు అన్వర్ హుస్సేన్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.