ఖమ్మం పట్టణం, చుట్టుపక్కల విస్త్రతంగా పర్యటించిన రవిచంద్ర*పలు శుభకార్యాలకు హాజరైన రాజ్యసభ

Published: Monday September 19, 2022
మధిర సెప్టెంబర్ 18 ప్రజా పాలన ప్రతినిధి
 రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆదివారం రోజంతా క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడిపారు.ఖమ్మం నగరంతో పాటు చుట్టుపక్కల విస్త్రతంగా పర్యటించారు.మొదట వాసవి కళ్యాణ మండపంలో జరిగిన భద్రాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రజతోత్సవాలకు లోకసభలో టిఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి హాజరై ప్రసంగించారు,దాని పాలక మండలి సభ్యులు, ఖాతాదారులకు శుభాకాంక్షలు తెలిపారు.సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ ఇంటికి వెళ్లి ఇటీవల పెళ్లైన ఆయన కూతురుకు నూతన వస్త్రాలు బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు.నగరంలోని ఏదులాపురంలో ఎర్రు ఏడుకొండలు, జ్యోతి దంపతుల కూతురు నూతన పట్టు వస్త్రాల అలంకరణ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. టిఆర్ఎస్ కార్పోరేటర్ తోట గోవిందమ్మ కుమారులు రమేష్, లక్ష్మణ్ ల పుట్టిన రోజు వేడుకలను రవిచంద్ర తన నివాసంలో జరిపి కేక్ కట్ చేశారు.ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడులో సిపిఐ ప్రముఖులు పుచ్ఛకాయల కమలాకర్ ఇంట్లో ఉప్పలమ్మ పండుగకు వద్దిరాజు హాజరయ్యారు.వైరా శాసనసభ్యులు రాములు నాయక్ అల్లుడు జూపల్లి ప్రదీప్ కుమార్ గుండెపోటుకు గురై మృతి చెందగా,భౌతిక కాయాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు, కుటుంబ సభ్యులను పరామర్శించారు.చింతకాని మండలం రామకృష్ణాపురంలో ఇటీవల మృతి చెందిన టిఆర్ఎస్ నాయకులు శెట్టి నరసింహారావు దశదిన కర్మకు హాజరై కుటుంబ సభ్యులను ఎంపీ పరామర్శించారు.ఆరెంపులలో మద్దలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చంచు జానకిరామయ్య భార్య సబిత ఇటీవల చనిపోగా నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిలతో కలిసి రవిచంద్ర పరామర్శించారు.అలాగే,బల్లేపల్లి మాజీ పట్వారి మట్టా వెంకట్రావు ఇటీవల మృతి చెందగా నామా నాగేశ్వరరావుతో పాటు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.సింగరేణి మండలం కారేపల్లిలో ఆదివారం మృతి చెందిన కొండబాల వెంకయ్య భౌతిక కాయాన్ని తాతా మధుతో పాటు సందర్శించి నివాళులర్పించారు.