కన్నుల పండుగ దుర్గామాత నిమజ్జనం చేవెళ్ల అక్టోబర్ 05, (ప్రజా పాలన):

Published: Thursday October 06, 2022

శరన్నవరాత్రుల్లో భాగంగా దుర్గ మాత నిష్ఠ  పూజలతో  భక్తులకు దర్శనమిచ్చి గంగమ్మ ఒడిని చేరింది. చేవెళ్ల మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి పుష్కరిణి ఆవరణలో రంగ రంగ వైభవంగా దుర్గామాత నిమజ్జనం జరిగింది. వివిధ గ్రామాలలో ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహాలను బ్యాండ్ బాజా లతో ఊరేగించి బుధవారం పుష్కరిణి ఆవరణలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. దింతో పుష్కరిణి ఆవరణం జనసంద్రంగా మారింది.