విజిలెన్స్ వారోత్సవాల వాల్ పోస్టర్ విడుదల

Published: Saturday October 29, 2022
శ్రీరాంపూర్ జిఎం బి. సంజీవరెడ్డి
శ్రీరాంపూర్ అక్టోబర్ 28: ప్రజా పాలన. 
ఈనెల 31 నుండి నవంబర్ 6వ తేదీ వరకు సింగరేణి వ్యాప్తంగా  విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహించనున్నామని శ్రీరాంపూర్ జిఎం బి సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిఎం కార్యాలయంలో అవగాహన వారోత్సవాలకు సంబంధించి వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్థలో ఎటువంటి అవినీతి జరగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన చర్యలను చేపడుతుందని తెలియజేశారు.  అలాగే ప్రతి ప్రతి ఒక్కరు అవినీతికి పాల్పడకుండా విధులు నిర్వహించినట్లయితే సంస్థ బాగుంటుందని ప్రతి ఉద్యోగి అవగాహన కోసం రిజల్ట్స్ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు
ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎం త్యాగరాజు, డీజీఎం పర్సనల్ గోవిందరాజులు, డీజీఎం ఐఈడి చిరంజీవులు, పి ఓ.పి. కాంతారావు తదితరులు పాల్గొన్నారు