దేశభక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
Published: Monday October 11, 2021
మధిర, అక్టోబర్ 10, ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణంలోని లడక బజార్ నందు దేశభక్తి జన సంఘం ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భముగా ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా 4వ రోజు అమ్మవారు అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అన్నపూర్ణ దేవి అవతారం సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని మధిర మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మొండితోక నాగరాణి. వార్డు కౌన్సిలర్గా రజిని ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, తీర్థ ప్రసాదములు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేశ భక్తి భజన సంఘం బాధ్యులు చెరుపల్లి శ్రీధర్, అరిగె శ్రీనివాసరావు, వల్లి శెట్టి శ్రీనివాసరావు, గుంటూరు రమణ రావు, చక్రవర్తుల వరదరాజన్, ఉపేంద్ర, బాహాటం వెంకటేశ్వర రాజు, పంది శ్రీను, కనకచారి, పంతంగి శేషగిరి, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: