ఘనంగా పెద్దమ్మ తల్లి కి బోనాలు

Published: Monday June 20, 2022

ఇబ్రహీంపట్నం, జూన్ 19 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని వర్ష కొండ గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడి  ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళలు పిల్లాపాపలు చల్లగా ఉండాలని పాడి పంటలు బాగా పండాలని వర్షాలు బాగా  కురవాలని  పెద్దమ్మ తల్లి కి డిజె చప్పట్లతో పోతురాజుల విన్యాసాలు తో అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొంతుల శ్యామల తుక్కారం, ఉపసర్పంచ్ మంగిలిపల్లి లక్ష్మణ్ , ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు పొనుకంటి చిన్న వెంకటి , ఎంపీపీ జాజాల భీమేశ్వరి జగన్ రావు, నాయకులు  జెడి సుమన్, కంఠం రమేష్, ఏడు సంఘాల  ముదిరాజ్ సభ్యులు మరియు ముదిరాజ్  యూత్ సభ్యులు మరియు మహిళలు పాల్గొన్నారు.