మెరిట్ స్కాలర్ షిప్ కు ఎంపికైన జడ్.పి.హెచ్.ఎస్ మోహన రావు పేట విద్యార్థిని.

Published: Wednesday July 20, 2022

కోరుట్ల, జూలై 19 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలం మోహనరావు పేట హై స్కూల్ లో ప్రస్తుతం 9వ తరగతి చదివే కుమారి. ఏ.వేద శ్రీ
జాతీయ స్థాయిలో ఎన్.ఎం.ఎం.ఎస్ పరీక్ష లో మెరిట్ స్కాలర్షిప్ కి ఎంపిక అయ్యింది. అందుకు జడ్.పి.హెచ్.ఎస్ మోహన రావు పేట  ప్రధానోపాధ్యాయురాలు కే.లలిత మరియు గ్రామ సర్పంచ్ ఎస్. మల్లారెడ్డి , ఛైర్మెన్ జి. రాణి మరియు ఉపాధ్యాయ బృందము వేదశ్రీ నీ అభినందించారు. వేద శ్రీ ఇంటర్ పూర్తి అయ్యేంత వరకు 12 వెల చొప్పున స్కాలర్ షిప్ వస్తుందని వివరించారు.వేద శ్రీ ఎన్.ఎం.ఎం.ఎస్ పరీక్ష అర్హత సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.