డ్రైనేజ్ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి : కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు
Published: Tuesday May 04, 2021
మేడిపల్లి, మే 3 (ప్రజాపాలన ప్రతినిధి) : రామంతాపూర్ డివిజన్లో నెలకొన్న డ్రైనేజ్ సమస్యలను శాశ్వత పరిష్కారానికి కృషి చేయనున్నట్లు స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు తెలిపారు. డివిజన్లోని భరత్ నగర్ రోడ్ నెంబర్ రెండులో డ్రైనేజీ సమస్య తలెత్తడంతో కాలనీవాసులు కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కార్పొరేటర్ సానిటేశన్ సిబ్బందిని పిలిపించి సమస్య తొందరగా పరిష్కారం కావాలని ఆదేశించారు. ఈ మేరకు శానిటేషన్ సిబ్బంది డ్రైనేజ్ సమస్యను వెంటనే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి సంకూరీ కుమారస్వామి, నిశాంత్, సురేష్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: