కెసిఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే టైం వచ్చింది బిజెపి
Published: Tuesday December 28, 2021
మధిర డిసెంబర్ 27 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ వస్తే అందరికి కొలువులు వస్తాయి అని నమ్మిన నిరుద్యోగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరాశ మిగిల్చింది. తెరాస ప్రభుత్వం నిర్లక్ష వ్యాఖరికి తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ గారు 27న తలపెట్టిన నిరుద్యోగల దీక్ష కార్యమానికి పిలునివ్వటంతో ఈ రోజు మధిరలో బిజెపి నాయకులను అక్రమ అరెస్టులు చేసినారు. ఈ అక్రమ అరెస్టులను బిజెపి నాయకులు ఖండిస్తూన్నారు అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే టైం వచ్చింది అని వారు తెలిపారు. అరెస్ట్ అయినవారిలో బిజెపి రాష్ట్ర దళిత మోర్చా కార్యదర్శి పెరుమాళ్లపల్లి విజయరాజు, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిలివేరు సాంబశివరావు, మధిర రూరల్ మండల ఇంచార్జి రామిశెట్టి నాగేశ్వరావు, బీజేవైఎం జిల్లా కార్యదర్శి కాసిన నాగభూషణం, మధిర పట్టణ ప్రధాన కార్యదర్శి పగడాల నాగేంద్రబాబు, బిజెపి నాయకులు కనపర్తి ప్రకాష్, బొడ్డు మాదవసాయి, మైనార్టీ మోర్చా గౌసుద్దీన్ అరెస్టు అయినవారిలో ఉన్నారు.
Share this on your social network: