బెల్లంపల్లి లొనే మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి

Published: Wednesday June 02, 2021

బెల్లంపల్లి జూన్ 1 ప్రజా పాలన ప్రతినిధి : బెల్లంపల్లి నియోజకవర్గo లొనే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ను ఏర్పాటు చేయాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ మద్దెల శ్రీనివాస్  డిమాండ్ చేశారు. మంగళవారం నాడు ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లిలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే ఉమ్మడి జిల్లాలోని అన్ని మారుమూల ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని అటు చెన్నూరు నుండి మొదలు కొని మహారాష్ట్ర లోని శిరోన్చ తాలూకా ప్రజలకు మరియు ఇటు బెజ్జూర్  నుండి వాంకిడి వరకు ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని. కాబట్టి బెల్లంపల్లి లొనే మెడికల్ కాలేజ్ ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు,  లేనియెడల అన్ని రాజకీయ పార్టీ లను,విద్యార్థి సంఘాలను, యువజన సంఘాల ను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో ఎన్ సి పి పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి మద్దెల శ్రీనివాస్ మరియు యూత్ ప్రెసిడెంట్ కొండికొప్పుల పవన్ కుమార్ యూత్ ప్రధాన కార్యదర్శి గాలిపెల్లి రాకేష్, మహిళా ప్రెసిడెంట్ చొప్పరి నందిని, ఎ ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ కొత్త సందీప్ కుమార్, మరియు కార్యదర్శులు డెబ్బటి కిషోర్, ఐడపు ప్రదీప్, మధుకర్ కామెర దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.