శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న పట్టణ సీఐ టంగుటూరి శ్రీను
Published: Wednesday August 24, 2022
వికారాబాద్ బ్యూరో 23 ఆగస్టు ప్రజా పాలన : శాంతి భద్రతల పరిరక్షణలో దైవానుగ్రహం లభించాలనే లక్ష్యంతో శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న పట్టణ సిఐ టంగుటూరి శ్రీను. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వికారాబాద్ ప్రాంత ప్రజలు సమన్వయంతో శాంతి సామరస్యంతో మెలుగుతూ పోలీస్ వారికి సహకరించాలని కోరారు. ఏ పౌరుడు కూడా చట్టపరిధిని మించి వ్యవహరించరాదని సూచించారు. శాంతి సౌభాగ్యాలను కాపాడుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పేర్కొన్నారు. ఆలయ పూజారి శ్రీకాంత్ స్వామి సిఐ టంగుటూరి శ్రీనుకు ప్రత్యేక అర్చన కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందించారు.
Share this on your social network: