సీఎం కేసీఆర్ చిత్రపటానికి పలాభిషేకం చేసిన కార్పొరేటర్ సుభాష్ నాయక్

Published: Monday October 03, 2022
మేడిపల్లి, అక్టోబర్2 (ప్రజాపాలన ప్రతినిధి)
గిరిజనులకు విద్య, ఉద్యోగ రంగాల్లో 6 నుండి 10 శాతం రిజర్వేషన్లు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం వల్ల గిరిజనుల జాతికి ఎంతో మేలు చేశారని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ 2వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సుభాష్ నాయక్ పేర్కొన్నారు. ఈ మేరకు  రిజర్వేషన్లు పెంచినందుకు సీఎం కేసీఆర్, మంత్రిలు సత్యవతి రాథోడ్, చామకూర మల్లారెడ్డి చిత్రపటాలకు కార్పొరేటర్ సుభాష్ నాయక్, మేడ్చల్ జిల్లా ఎస్టి నాయకులు పాలాభిషేకం చేశారు.