*ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు*
Published: Friday January 13, 2023
మంచిర్యాల టౌన్, జనవరి 12, ప్రజాపాలన : స్వామి వివేకానంద 160వ జయంతి, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ పద్మశాలి విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్ లో గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ పద్మశాలి విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరాల వంశీ మాట్లాడుతూ ప్రపంచ ఖ్యాతిని గడించి భారతదేశం సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసి సంఘ విద్రోహలతో పోరాడి మెరుగైన సమాజం కోసం శ్రమించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు. విద్యార్థిని విద్యార్థులు వివేకానంద ను ఆదర్శంగా తీసుకొని అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సామల శివ తేజ, అరుణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: