రానున్న రోజుల్లో బీజేపీలో భారీగా చేరికలు.. జిల్లా నాయకులు ప్రభారి
Published: Saturday February 04, 2023
తల్లాడ, పిభ్రవరి 3 (ప్రజా పాలన న్యూస్): రానున్న రోజుల్లో తెలగాణతో పాటు జిల్లా వ్యాప్తంగా బీజేపీలో భారీగా చేరికలు ఉంటాయని ఆ పార్టీ జిల్లా నాయకులు ప్రభారి అన్నారు. శుక్రవారం
పార్టీ తల్లాడ మండల మండల అధ్యక్షుడు ఆపతివెంకట రామారావు అధ్యక్షతన పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మండల ప్రబారి, బండారి నరేష్ పాల్గొని మాట్లాడుతూ మండలంలో ఉన్నటువంటి 56 పోలింగ్ బూతులలో భాజపాను పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలని, ప్రతి పోలింగ్ బూతులోనూ కమిటీలు వేయాలని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పార్టీని మరింత పటిష్టపరిచుకోవాలన్నారు.తల్లాడ మండలాన్ని కాషాయపు మయం చేయడమే మా లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆపతి వెంకట రామారావు, తేజావత్ బాలాజీ నాయక్, గాదే కృష్ణారావు, పాల్గొన్నారు.
Share this on your social network: