శ్రీ మల్లికార్జున స్వామి ప్రైమరీ షిప్ రీడర్స్ కోపరేటివ్ సొసైటీలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

Published: Tuesday July 19, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 18 ప్రజాపాలన ప్రతినిధి  బండ లేమూర్ గ్రామంలో
' శ్రీ మల్లికార్జునస్వామి ప్రైమరీ షిప్ బ్రీడర్స్ కోపరేటివ్ సొసైటీ '  ఎన్నికలు నిర్వహించగా ఈ నెల 14 తేదీన నామినేషన్లు స్వీకరించగ 9 మంది డైరెక్టర్ లకు గాను 9 నామినేషన్లు మాత్రమే వచ్చాయి. నామినేషన్లు వట్టి వెంకటేష్, మూడిగే వెంకటేశ్,  బద్దుల రమేష్, వళ్లపు రంగయ్య, వట్టి జంగయ్య, జక్కలి సాలయ్య, ముత్యాల ఐలయ్య, గునమొని ఎల్లమ్మ, బూడిద మనోహర  లు వేశారు. 9 మందిలో ఒకరు ముత్యాల ఐలయ్య తన నామినేషన్ ను విరమించుకోగ 9 మంది డైరెక్టర్ లకు గాను 8 మంది ఏకగరీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మాధవరెడ్డి ప్రకటించారు. వారిలో   అధ్యకులుగా బద్దుల రమేష్, ఉపాధ్యక్షులుగా బూడిద మనోహర, కార్యదర్శిగా మూడిగే వెంకటేశ్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ  వారికి ఎన్నిక పత్రాలు అందజేశారు.