శ్రీ మల్లికార్జున స్వామి ప్రైమరీ షిప్ రీడర్స్ కోపరేటివ్ సొసైటీలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
Published: Tuesday July 19, 2022
ఇబ్రహీంపట్నం జూలై తేదీ 18 ప్రజాపాలన ప్రతినిధి బండ లేమూర్ గ్రామంలో
' శ్రీ మల్లికార్జునస్వామి ప్రైమరీ షిప్ బ్రీడర్స్ కోపరేటివ్ సొసైటీ ' ఎన్నికలు నిర్వహించగా ఈ నెల 14 తేదీన నామినేషన్లు స్వీకరించగ 9 మంది డైరెక్టర్ లకు గాను 9 నామినేషన్లు మాత్రమే వచ్చాయి. నామినేషన్లు వట్టి వెంకటేష్, మూడిగే వెంకటేశ్, బద్దుల రమేష్, వళ్లపు రంగయ్య, వట్టి జంగయ్య, జక్కలి సాలయ్య, ముత్యాల ఐలయ్య, గునమొని ఎల్లమ్మ, బూడిద మనోహర లు వేశారు. 9 మందిలో ఒకరు ముత్యాల ఐలయ్య తన నామినేషన్ ను విరమించుకోగ 9 మంది డైరెక్టర్ లకు గాను 8 మంది ఏకగరీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మాధవరెడ్డి ప్రకటించారు. వారిలో అధ్యకులుగా బద్దుల రమేష్, ఉపాధ్యక్షులుగా బూడిద మనోహర, కార్యదర్శిగా మూడిగే వెంకటేశ్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ వారికి ఎన్నిక పత్రాలు అందజేశారు.
Share this on your social network: