నగర వ్యాపారవేత్త మల్లం శివ గణేష్ బాబుకు జాతీయస్థాయి అవార్డు హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి)

Published: Friday February 17, 2023

ఎకో ఫ్రెండ్లీ నివాసాలను నిర్మిస్తున్న నగర వ్యాపారవేత్త జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు. మల్లం శివ గణేష్ బాబు ఇండో ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థను స్థాపించి ఈకో ఫ్రెండ్లీ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఢిల్లీకి చెందిన ఓ సంస్థ యంగ్ సి ఈ ఓ ఆఫ్ ద ఇయర్ -2022 తో పాటు మోస్ట్ ఇన్నోవేటివ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్ 2022  అవార్డులకు ఎంపిక చేసింది. గత నెల 21న దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో శివ గణేష్ బాబు అవార్డులను అందుకున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ఉద్యోగులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గణేష్ బాబు మాట్లాడుతూ భారీ నిర్మాణాల వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని దీనిని గుర్తించిన తాము ఎకో ఫ్రెండ్లీ నిర్మాణాలకు శ్రీకారం చుట్టామని చెప్పారు.  అవార్డులు అందుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, అదే సమయంలో తనపై మరింత బాధ్యతలు పెంచిందని అన్నారు. భవిష్యత్తులో సైతం ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ ప్రకృతికి హాని చేయని విధంగా నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఇండో ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.