శ్రీ మృత్యుంజయ స్వామి వారి దేవస్థానం, దాతల సహకారంతో ప్రతి సోమవారంశివాలయం అన్నదానం వితరణ

Published: Tuesday February 15, 2022
మధిర ఫిబ్రవరి 14 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో రెండో కాశీ గా పిలవబడుతున్న శివాలయం నందు ప్రతి సోమవారం అన్నదానం  వితరణలో భాగంగా దాతల సహకారంతో ఈ అన్నదాతలు నాళ్ళ శ్రీనివాసరావు ధర్మపత్ని సౌజన్య, పిల్లలు సాయి చరిత్, వాత్సల్య, మరియు వేముల నరేష్ కుమార్ ధర్మపత్ని అనూష పిల్లలు అభిష్న,వారి కుటుంబం తో అన్నదాన కార్యక్రమం జరిగిందని ఆలయ కమిటీ తెలిపింది ఈరోజు దాతలు ఈ సందర్భంగా మాట్లాడుతూ శివాలయంలో అన్నదాన కార్యక్రమం చేయటం ఈశ్వరుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని పేదలకు అన్నదానం చేయడం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు గారు, ధర్మకర్తలు పబ్బతి రమేష్, పూజారులు రాయప్రోలు వెంకట సత్యనారాయణ శర్మ మరియు మల్లెల సాయి ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు