దేవుని దర్శనం కోసం కాలినడకన బయలుదేరిన తల్లాడ యువకులు..

Published: Monday November 28, 2022
తల్లాడ, నవంబర్ 27 (ప్రజా పాలన న్యూస్): 
 దేవుని దర్శనం కోసం తల్లాడ ఆర్య వైశ్య యువకులు ఆదివారం కాలినడకన బయలుదేరి వెళ్లారు. తల్లాడ ఆర్యవైశ్య సంఘం యువకులు వేమిశెట్టి దిలీఫ్ ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. తల్లాడ నుండి గార్లఒడ్డు వరకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో  మార్గమధ్యలో లక్ష్మీ నగర్ వద్ద ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలినడకన గార్లొడ్డుకు చేరుకొని అక్కడ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యూత్ సభ్యులు షరాబు మణికంఠ, వేములపల్లి నరసింహారావు, వెచ్చా శేషగిరి, నిఖిల్ స్వామి, బుస్సా చైతూ, పసుమర్తి కిషోర్, పసుమర్తి సందీప్, పసుమర్తి సుధాకర్, అనుమోలు అజయ్,  సందీప్, నేరెళ్ల సాయి తదితరులు ఉన్నారు.