బీజేపీ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదు --మహారెడ్డి భూపాల్ రెడ్డి

Published: Tuesday October 11, 2022
చౌటుప్పల్, అక్టోబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి):చౌటుప్పల్ మండలం నేలపట్ల, కుంట్లగూడెం గ్రామంలో నారాయణపేట శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భూపాల్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని, గత ప్రభుత్వాలు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదని, రాజగోపాల్ రెడ్డి మూడున్నర సంవత్సరాలలో ఒక్క రూపాయి అభివృద్ధి కూడా చేయలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం మీద రాజగోపాల్ రెడ్డి పిచ్చి కూతలు మానుకోవాలని హెచ్చరించారు. కాంట్రాక్టుల కోసమే బిజెపిలో చేరానని స్వయంగా రాజగోపాల్ రెడ్డి ఒప్పుకోవడం ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని, డబ్బుంటే ఏదైనా సాధ్యమే అనే ధీమాతో రాజగోపాల్ రెడ్డి ఉన్నాడని,త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. గత ప్రభుత్వాలలో పథకాలన్నీ శిలాఫలకాలకే పరిమితమయ్యాయని కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కార్యరూపం దాల్చి ప్రతి ఇంటికి అన్ని పథకాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కప్పల శీను, టిఆర్ఎస్ అధ్యక్షులు పబ్బతి ఆంజనేయులు, సింగిల్ విండో చైర్మన్ పబ్బతి వెంకటయ్య, చౌట నరసింహ, మాజీ ఎంపిటిసి బత్తుల శంకర్, టిఆర్ఎస్ కార్యదర్శి బూడిద లింగస్వామి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.