పది లక్షల ప్రమాద బీమా చెక్కును అందించిన బెల్లంపల్లి ఎస్ బి ఐ మేనేజర్

Published: Wednesday November 16, 2022
బెల్లంపల్లి నవంబర్ 14 ప్రజా పాలన ప్రతినిధి:  ఐదు రూపాయలతో ప్రమాద బీమా పాలసీ చేస్తే ప్రమాదవశాత్తు మరణిస్తే మరణించిన కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని, బెల్లంపల్లి స్టేట్ బ్యాంకు మేనేజర్ బుచ్చయ్య అన్నారు.
సోమవారం ప్రమాద బీమా చెక్కును అందించిన అనంతరం ఆయన మాట్లాడారు,
తాండూరు మండలం బోయపల్లి కి చెందిన దాసరి రిషికేష్ గౌడ్, రెండు నెలల క్రితం బెల్లంపల్లి బజాజ్ ఏరియాలోని స్టేట్ బ్యాంకులో 500 రూపాయలతో ప్రమాద బీమా చేశాడని, దురదృష్టవశాత్తు ఇటీవల
 ప్రమాదంలో మరణించగా, రిషికేష్ గౌడ్ తల్లి దాసరి మౌనికకు సోమవారం 10 లక్షల రూపాయల చెక్కును అందించామని ఆయన తెలిపారు, ప్రతి ఒక్కరూ 500 రూపాయలతో ప్రమాద బీమా చేస్తే అనుకోని సంఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు భీమా డబ్బులు ఆదుకుంటాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది శ్రావణ్, ఆక్టేమ్, మహేష్, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.