కూరగాయలు నిత్యావసర సరుకుల పంపిణీ

Published: Wednesday May 26, 2021
వలిగొండ, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని  పహిల్వాన్ పూర్ బిజెపి గ్రామశాఖ ఆధ్వర్యంలో సేవా హీ సంఘటన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో కరోనా బాధితులకు పచ్చి మట్ల పాండు గౌడ్ సహకారంతో గ్రామంలో కూరగాయలు మరియు నిత్యవసర సరుకులు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధానకార్యదర్శి వట్టిపల్లి సంతోష్ గౌడ్, రేపాక పాండు,బంధారపు లింగస్వామి, కళ్లెం శేఖర్, వట్టిపల్లి కృష్ణకాంత్, మాధ మదన్, రాగిరు భరత్, గంగదారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.