మరుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కార్పొరేటర్ చేతన హరిష్

Published: Wednesday April 05, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 4 (ప్రజాపాలన ప్రతినిధి)
హబ్సిగూడ డివిజన్లోని సాయి చిత్ర నగర్ కాలనీ మరుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని స్థానిక కార్పొరేటర్ కక్కిరేణి చైతన్ హరీష్ అధికారులకు సూచించారు. ఈ మేరకు   కార్పొరేటర్ అధికారులతో కలిసి   సాయిచిత్ర నగర్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ  సాయిచిత్రానగర్ కాలనీకీ డ్రైనేజి మరుగునీటి అవుట్ లైట్ లేక మురుగునీరు అంతా రామంతపూర్ పెద్ద చెరువులో  కలుస్తున్నాయని తద్వారా చెరువులో నీరంతా కలుషితమైపోయి దుర్వాసన వెదజల్లి  చుట్టుపక్కల కాలనీ ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందని అన్నారు. త్వరలోనే సాయిచిత్ర నగర్ మురుగునీటికి  శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యూఎస్ జిఎం సంతోష్ ,డీజీఎం రజినీకాంత్ ,మేనేజర్ ఆసిఫ్ అలీ  స్థానికులు వేములకొండ సోమశేఖర్ , భరత్ జి ,రాఘవరెడ్డి, నర్సింహ్మ రెడ్డి, అనిల్, ప్రబాకర్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు సంజయ్ పటేల్  సుమన్ రావు, అర్ వి శేఖర్,ప్రధాన కార్యదర్శి చింతకింది ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.