వెల్ కమ్ బోర్డు ని తొలగించిన చైర్పర్సన్ జక్కుల శ్వేత

Published: Wednesday June 08, 2022
బెల్లంపల్లి జూన్ 7 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుబ్బారావు పల్లె వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వెల్కమ్ బోర్డు ,( పట్టణ కమాన్ ) ను శిథిలావస్థలో ఉండి  కూలిపోయే ప్రమాదంలో ఉన్నందున, ప్రజలు  చేసిన విజ్ఞప్తి మేరకు, స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు వెల్కమ్ బోర్డు ను క్రేన్, లాడర్, మున్సిపల్ సిబ్బంది, సహకారంతో  తొలగించి నట్లు చైర్ పర్సన్ జక్కుల శ్వేత తెలిపారు.
ఈ కార్యక్రమంలో  చైర్ పర్సన్  జక్కుల శ్వేతా , మరియు కమీషనర్ రజిత, వార్డు కౌన్సిలర్  కొక్కెర చంద్రశేఖర్ , టి.ఆర్.ఎస్ నాయకులు శ్రీధర్, నెల్లి రమేష్ ,  మునిసిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.