తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల దొంగతనం జరగకుండా శాంతిభద్రత

Published: Friday June 17, 2022

తాండూర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సిసి కెమెరాల ఏర్పాటు కార్యక్రమంలో కాంగ్రెస్ శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు .తాండూరు పట్టణంలోని అన్ని ఆర్గనైజేషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లయితే దొంగతనాలు జరగకుండా ఉంటాయని ,శాంతిభద్రతల పరిరక్షణ ఉంటాయని, ఆయన అన్నారు .తాండూరు పట్టణంలో మార్కెట్ కమిటీ స్థలం సరిపోవడం లేదని అందుకు ప్రభుత్వం 30 ఎకరాల్లో మార్కెట్ కమిటీ నిర్మించబోతోంది అందుకు శంకుస్థాపన పనులు వెంటనే జరుగుతాయని ఆయన చెప్పారు. మార్కెట్ కమిటీ ఏర్పాటు అయితే రైతులకు సౌకర్యంగా ఉంటుందని అదేవిధంగా వ్యాపారులకు సౌకర్యంగా ఉంటుందని ఆయన చెప్పారు. సిసి కెమెరాల ఏర్పాటుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి తాండూర్ డిఎస్పి శేఖర్ గౌడ్ రాజేందర్ రెడ్డి తాండూరు పట్టణ టిఆర్ఎస్ నాయకులు  నయుం తదితరులు పాల్గొన్నారు.