గుండెపోటుతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి

Published: Friday June 24, 2022
వారి కుటుంబాన్ని పరామర్శించిన అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని
 
 
బోనకల్, జూన్ 23 ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామం లోని గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇరుగు గాలిబు(55) గురువారం తెల్లవారు జామున 6 గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేశారు అలాగే మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క,సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ నందిని పార్టీ జెండా కప్పి సంతాపం తెలియజేశారు. అదేవిధంగా వారి కుటుంబాన్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కిలారు వెంకటేశ్వర్లు , మర్రి రామారావు, సీతారాములు, రాజు ,గోవిందపురం సర్పంచ్ ఉమ్మినేని బాబు , రమేష్ తదితరులు పాల్గొన్నారు.