పలు కాలనీవాసులకు జాగ్రత్తలు చెప్పిన మేయర్

Published: Tuesday May 11, 2021
బాలపూర్:(ప్రతినిధి) ప్రజాపాలన : కరోన సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉంది కావున కాలనీవాసులు జాగ్రత్తలు పాటించాలని కార్పొరేషన్ మేయర్ అన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ 31 వ డివిజన్ సాయిబాలజీ ఫేస్ 1, ఫేస్ II లో హైపోక్లోరైడ్ పిచికారీ చేయించిన మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. సోమవారం నాడు పలు కాలనిలలో హైపొక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించి కాలనీ కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి కాలనీవాసులు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ సిబ్బంది, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.