ఘనంగా మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు

Published: Tuesday November 23, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 22 ప్రజాపాలన : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనయుడు మంచి రెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి) ఆయన ధర్మపత్ని మౌనిక ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆరుట్లలో జరిగే బుగ్గ రామలింగేశ్వర స్వామి దర్శనానికి  సోమవారం వెళుతున్న సందర్భంగా  ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు,  బంటి యూత్ ఫోర్స్, అభిమానులు పెద్ద ఎత్తున  చౌరస్తాకు చేరుకొని ఘనంగా స్వాగతం పలికి టపాసులు పేల్చి, శాలువాలు కప్పి పూల బొకే ఇచ్చి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, టిఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మడుపు వేణుగోపాల్ రావు, మాజీ మున్సిపల్ అధ్యక్షుడు భరత్ కుమార్, కౌన్సిలర్లు జెర్కొని బాలరాజు, భర్తాకి జగన్, నల్ల బోలు మమతా శ్రీనివాస్ రెడ్డి, శ్రీలత రాంబాబు, నీలం బాను, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జెర్కొని రాజు, విద్యా విభాగం అధ్యక్షుడు నిట్టు జగదీశ్వర్, చెనమోని శివ డ్రైవర్ యూనియన్ నాయకుడు సభిర్ర్ టిఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.