కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి

Published: Monday January 10, 2022
కాంగ్రెస్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి
మేడిపల్లి, జనవరి 9 (ప్రజాపాలన ప్రతినిధి) : రామంతాపూర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. రామంతపూర్ డివిజన్లో ఐవైసి ఎక్స్ కోఆర్డినేటర్ వినోద్ ముదిరాజ్ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన ఉప్పల్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రామంతాపూర్ డివిజన్లో ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 300 లకు తగ్గకుండా డిజిటల్ సభ్యత్వ నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచ్చిన్, అశోక్, చింటూ బసరి, బసని మధు, ఉదయ్, పవన్, కాళిదాస్, యాదగిరి, సాయి, గుడుంబా నాగ, డిసిసి ఆర్గనైజ్ సెక్రెటరీ సంజయ్ జైన్, జిల్లా ఎస్ టి సెల్ చెర్మేన్ గణేష్ నాయక్, కిషన్ నాయక్  తదితరులు పాల్గొన్నారు.