ఒకే పాఠశాల నుంచి నలుగురు విద్యార్ధులకు అవార్డులు.

Published: Thursday September 22, 2022

 

పాలేరు సెప్టెంబర్ 21 ప్రజా పాలన ప్రతినిధి
నేలకొండపల్లి
మండలంలోని రాజేశ్వరపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల కు చెందిన నలుగురు విద్యార్ధులు ప్రతిభ చూపారు. అవార్డులు పొందారు.
 
పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాక్ష్యం నేషనల్ పోటీలలో పాఠశాల నుంచి నలుగురు విద్యార్ధులు ప్రతిభ చూపారు. రాష్ట్ర స్థాయి లో విన్నర్ గా నిలిచారు. వ్యాసరచన పోటీలో స్నేహ ప్రతిభ చూపారు. రూ.4 వేలు బహుమతి ని అందుకున్నారు. అందెశ్రీ పెయింటింగ్ విభాగం. డి.ఉదయ్, దీక్షిత లు క్విజ్ లో ప్రతిభ చూపారు. వీరికి ఒక్కక్కరికి రూ.4 వేల చొప్పున బహుమతి ని అందించారు. ఒకే పాఠశాల నుంచి నలుగురు విద్యార్ధులు ప్రతిభ చూపటంతో విద్యార్థులను పలువురు అభినందించారు. సర్పంచ్ దండా పుల్లయ్య, ఉపాధ్యాయులు యం.ఆదిత్య కుమార్ తదితరులు విద్యార్థులను ప్రశంసించారు.