పేదింటి తల్లులకు పెద్ద కొడుకు సీఎం కేసీఆర్

Published: Friday September 09, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 8 ప్రజాపాలన ప్రతినిధి.ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల కేంద్రంలోని దండేటికారి శర్పంజీ గార్డెన్స్ లో మండలానికి చెందిన 1540 మంది నూతన పింఛనుదారులకు ఆసరా పింఛన్లను స్థానిక ఎంపిపి నర్మదా, జడ్పిటిసి నిత్య నిరంజన్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసిలు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి  పంపిణీ చేశారు.
అనంతరం మండలానికి చెందిన 42మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ - షాదీముబారక్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ వృద్దులకు మరియు పెండ్లి చేసి కష్టాల్లో ఉన్న పేదింటి తల్లులకు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  పెద్ద దిక్కై ఇంట్లో పెద్ద కొడుకులా ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మీ లాంటి పథకాలు ఇచ్చి ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.