అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ హమీద్ పటేల్

Published: Saturday December 11, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఏ బ్లాకులో జరుగుతున్న అంతర్గత డ్రైనేజీ పనులను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, స్థానిక నాయకులు, జీహెచ్ఎంసి అధికారులతో కలసి పనుల తీరును పర్యవేక్షించారు. ప్రేమ్ నగర్ ఏ బ్లాకులోని 4వ నంబరు వీధి నుండి 7వ నంబరు వీధి వరకు 40 లక్షల అంచనా వ్యయంతోనూ, 19వ వీధి నుండి 21వ వీధి వరకు 32 లక్షల అంచనా వ్యయంతోనూ, 9వ వీధి నుండి 25 వ వీధి వరకు కోటి రూపాయలు అంచనా వ్యయంతోనూ మొత్తంగా ఒక కోటి డభై రెండు లక్షల అంచనా వ్యయంతో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పర్యవేక్షించి, నాణ్యత ప్రమాణాలను పాటించి, పనులను చేపట్టాలని కాంట్రాక్టర్లకు కార్పొరేటర్ హమీద్ పటేల్ సూచించారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ తో బాటుగా జీహెచ్ఎంసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డీఈ రమేష్, ఏఈ జగదీష్, వర్క్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్, సయ్యద్ మఖ్బుల్ సాబ్, మహ్మద్ నసీరుద్దీన్, మహ్మద్ ఫరూక్, మెహబూబ్ సాబ్, షేక్ అహ్మద్, జహంగీర్, రవి, ఇస్మాయిల్, సోహిల్, హాజీ, అజ్జు ముల్సబ్, వసీమ్, నరేష్ మరియు బస్తీ వాసులు ఉన్నారు.