పోలీసుల అదుపులో ఏటీఎం చోరీ దొంగలు.

Published: Thursday June 17, 2021

మధిర, జూన్ 16, ప్రజాపాలన ప్రతినిధి : పట్టణంలో ఆర్ వి కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఏటీఎంలో 13వ తారీకు రాత్రి రెండున్నర గంటల సమయంలో మాస్కులతో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఏటీఎంలో కి చొరబడి ఏటీఎం మిషన్ పగలగొట్టే ప్రయత్నం చేసిన వీడియో ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావటం ఆ ఎటిఎం కి సంబంధించిన వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే మధిర టౌన్ పోలీస్ స్టేషన్ లో ప్రొబేషనరీ ఎస్ఐ గా పనిచేస్తున్న షకీర్ బ్లూ కోట్ కానిస్టేబుల్ రామారావు సహకారం, సమాచారం తో ఏటీఎం చోరీ చేసిన దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏటీఎంలో చోరీ చేసిన దొంగలు మధిర ఎస్సీ కాలనీకి చెందిన వ్యక్తులుగా గుర్తించినట్లు సమాచారం. ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన ఇద్దరు దొంగలను చాకచక్యంగా పట్టుకున్న ప్రొబేషనరీ ఎస్ ఐ షకీర్ ను బ్లూ కోట్ కానిస్టేబుల్ రామారావును మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ ఓ.మురళి అభినందించినట్లు సమాచారం. ఏటీఎం చోరీకి ప్రయత్నించిన వ్యక్తులు గతంలో మధిరలో చిన్న చిన్న దొంగతనాలు చేసినట్లు సమాచారం.