దీనబందు కాలనిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Thursday June 03, 2021
కూకట్ పల్లి: జూన్ 02, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూకట్ పల్లి డివిజన్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో దీనబందు కాలనీ చౌరస్తా వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కోట్లాది తెలంగాణ బిడ్డల ఆకాంక్షల ప్రతిరూపమే ఈ తెలంగాణ రాష్ట్రం అని, వేలాది మంది వీరుల త్యాగ ఫలితంతోనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో దీనబందు కాలనీ అధ్యక్షుడు మహేందర్ నాయక్, గడ్డం కృష్ణ, ఆవుల రాజు, వార్డ్ సభ్యులు ఎల్లం నాయుడు, వెంకటయ్య, సుహాస్, మోహన్ రావు, నాగన్న, బాలు, కేవీ రావు, సంజీవరెడ్డి, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.