జగిత్యాల రూరల్ మండల్ ఎంపీపీ గాజార్ల గంగారాం గౌడ్ కరోనాతో మృతి
Published: Friday April 30, 2021
జగిత్యాల, ఏప్రిల్ 29, (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల రూరల్ మండల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు గాజర్ల గంగారాం గౌడ్ కరోనాతో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. గంగారాం మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డా.సంజాయ్ కుమార్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉండగా హుటాహుటిన జగిత్యాలకు బయలుదేరి వచ్చి వారి కుటుంబ సభ్యులను మరామర్శించి ఓదార్చి ప్రగాఢ సానుభూతిని వెలిబుచ్చారు. జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ సీనియర్ తెరాస నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.
Share this on your social network: