27 of 3,768 నకిలీ డాక్యుమెంట్లతో భూములను విక్రయిస్తున్న అక్రమార్కులు

Published: Monday May 16, 2022
మేడ్చల్ జిల్లా (ప్రజాపాలన) : మేడ్చల్ జిల్లా కీసర పోలీసు స్టేషన్ పరిధి రాంపల్లిలో సర్వే నెంబర్ 354,355,356,మరియు 357 లో 1214  గజాలను ప్లాట్స గా విభచించి  నకిలీ డాక్యుమెంట్స్ పత్రాలు సృటించి విక్రయిస్తున్న ఎనిమిది మంది నింధితులను అరెస్ట్ చేసిన కీసర పోలీసులు.
 
వీరి వద్ద నుండి రెండు కార్లు స్టాంప్స్,బండ్ పేపర్స్ స్వాధీనం చేసుకున్న 
పోలీసులు. సుమారు ఈ ప్లాట్స్ విలువ ఐదు కోట్లు. వీరిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించిన పోలీసులు. దొంగ రిజిస్ట్రేషన్స్ చేసిన విషయంపై కీసర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వారిని కూడా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.