రంజాన్ కానుకలను అందచేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Wednesday April 27, 2022
బెల్లంపల్లి,  ఏప్రిల్ 26, ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణంలోని జామా మసీదులో సోమవారం  రంజాన్ పండుగ సంధర్బంగా ప్రభుత్వం నుండి వచ్చిన, కానుకలను నిరుపేద ముస్లిం సోదర, సోదరిమనిలకు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అందచేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మైనారిటీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్, బి.సుదర్శన్, కౌన్సిలర్లు షేక్ అఫ్సర్, అస్మా యూసుఫ్, నీలి కృష్ణ బొడ్డు నారాయణ, తెరాస మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండిఎజాజ్, కో అప్షన్ సభ్యులు వాజీద్, సాజిద్, పట్టణ కార్యదర్శి, కలీం బేగ్, జామ మస్జీద్ అధ్యక్షులు హాజీ, గౌసే ఆజాం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు షైక్ ముక్తియార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఖాజా, వార్డ్ మైనారిటీ అధ్యక్షులు యూసుఫ్, నాయకులు సయ్యద్ ఉల్ఫాత్,  షైక్ మునీర్, ఎండీ అన్వార్, వాజీద్, సలీం ఖాన్, అంజాద్ ఖాన్, తాజ్ ఖాన్, జావీద్, షైక్ సలీం, ఖాసీం, తయ్యబ్, జలీల్, పోలు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.